Thursday, December 6, 2012

'బాద్‌షా'లో ఎన్టీఆర్ క్యారక్టరైజేషన్ కేక


Badshah Shoot At Shamshabad
ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజధానిలో షూటింగ్ జరుగుతోంది. శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.ఈ సందర్బంగా కలిసిన మీడియాతో శ్రీను వైట్ల మాట్లాడారు.

చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ గురించి శ్రీనువైట్ల చెప్తూ...అతనొక్కడే. కానీ ఓ సైన్యం నడిచొస్తున్నట్టుంటుంది. చాలా తక్కువ మాట్లాడతాడు.. కానీ ప్రతి మాటా ఓ మిస్సైల్‌లా దూసుకొస్తుంది. ఒక్కసారే మాటిస్తాడు... ప్రాణం ఉన్నంత వరకూ దానికి కట్టుబడి ఉంటాడు. అందుకే... అతను 'బాద్‌షా' అయ్యాడు. ఇంతకీ అతని గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు శ్రీను వైట్ల.

''పేరుకి తగ్గట్టే.. శక్తిమంతమైన కథ ఇది. ఎన్టీఆర్‌ని ఇది వరకెప్పుడూ చూడని కోణంలో చూపిస్తున్నాం. పాత్ర తీరే కాదు.. ఆయన గెటప్‌ కూడా సరికొత్తగా ఉంటుంది''అని నిర్మాత తెలిపారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు.

థాయ్‌ భాషలో రాజమౌళి 'ఈగ'

Rajamouli Eega Be Released Thai Version
'ఈగ'త్వరలో ధాయ్ లాండ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఈగ' తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు విదేశాలకీ ఎగరబోతోంది. థాయ్‌ భాషలోకి 'ఈగ' చిత్రాన్ని అనువదించబోతున్నారని సమాచారం. థాయ్‌లాండ్‌ దేశవాసులూ సినీప్రియులే కావటంతో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు.

భారత సంస్కృతికి దగ్గరగా ఉంటాయి వారి పద్ధతులు, అభిరుచులు. 'ఈగ'లోని సాంకేతిక మాయాజాలంతోపాటు ఆత్మ మరో ప్రాణిలోకి ప్రవేశించడం లాంటి అంశాలు థాయ్‌లాండ్‌ వాసులకు నచ్చుతాయనే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. భారత చిత్రసీమ ఇన్నాళ్లూ ఆ దేశాన్ని షూటింగులకు అనువైన ప్రాంతంగా మాత్రమే భావించింది. ఇక థాయ్‌లాండ్‌ని ఓ మార్కెట్‌గా మలచుకోబోతున్నారు. ఆ దేశానికి చెందిన కొందరు ఎగ్జిబిటర్లు ఇప్పటికే పలువురు హిందీ నిర్మాతలతో ఒప్పందాలు చేసుకున్నారు... అనువాద హక్కుల కోసం. వచ్చే యేడాది నుంచి భారతీయ చిత్రాలు థాయ్‌లోకి అనువాదం కాబోతున్నాయన్న మాట.

నో ఫంక్షన్ : రిలీజైన ‘సారొచ్చారు’ ఆడియో

మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న ‘సారొచ్చారు' ఆడియో ఎలాంటి హడావుడి, ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజైంది. ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. రవితేజ ఇమేజ్ కు తగిన విధంగా ఈచిత్రంలో దేవిశ్రీ మాస్ బీట్లతో పాటు, వినసొంపైన మొలోడీలను కంపోజ్ చేసాడు.
sarocharu audio released directly into the market
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్ వివరాలు
1. మేడ్ ఫర్ ఈచ్ అదర్
2. జగదేక వీరా
3. రచ్చ రంబోలా...
4. గుస గుస
5. కాటుక కళ్లు

Wednesday, December 5, 2012

రాజమౌళితో చేయాలని ఉంది :- అక్షయ్ కుమార్

Akshay Kumar Wants Rajamouli
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘కిలాడీ 786' షూటింగులో బిజీగా గడుపుతున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన అక్షయ్ కుమార్ ఇక్కడ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నాడు. ఈచిత్రం భిన్నంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా సౌత్ సినిమా స్టాండర్డ్స్‌పై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు అక్షయ్ కుమార్ స్పందిస్తూ...‘సౌత్ సినిమాలపై నేను సీరియస్ గా దృష్టి పెడుతున్నాను. నా సినిమాల్లో చాలా వరకు సౌతిండియా దర్శకులు తీసిన సినిమాలకు రీమేకే. వారు చాలా ప్రతిభా వంతులు. సౌతిండియా సినీ పరిశ్రమలో పని చేసిన వారు బాలీవుడ్ ఇంటస్ట్రీలో పని చేయడానికి ఆసక్తి చూపితే నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. నాకు రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఉంది, కానీ అది కుదురుతుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను' అంటూ అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ లో నటించబోతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్టయిన ‘తుపాకి' చిత్ర రీమేకులో చేయబోతున్నాడు. కథాపరంగా ఇది ముంబయిలో జరిగే అంశం కావడంతో హీరో అక్షయ్‌కుమార్‌ హిందీలో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విపుల్‌షా నిర్మాతగా తెరకెక్కనుంది. మురగదాస్ దర్సకత్వం వహిస్తారు.

Latest Info ప్రభాస్ ‘మిర్చి’

Prabhas Mirchi Shooting Wrapped Up Dec 11
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘మిర్చి' చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగుకు సంబంధించిన పని దాదాపుగా అయిపోయినట్లే. మరో వారం రోజుల్లో షూటింగ్ వర్క్ మొత్తం పూర్తి కానుందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం. రేపటి నుంచి ఓ సాంగుతో పాటు మిగిలి ఉన్న కొన్ని సీన్లను షూట్ చేయనున్నారు.

యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
గతంలో ఈచిత్రాన్ని డిసెంబర్లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నిర్మాతలు, ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా థియేటర్ల సమస్య కారణంగా ‘మిర్చి' ఫిబ్రవరి 8న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.