Thursday, September 6, 2012

‘షిరిడి సాయి’ రివ్యూ..........





అన్నమయ్యతో ఊహించని విజయాన్నందుకున్న నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి.. అదే కోవలో శ్రీరామదాసును తెచ్చి, మరో విజయాన్నందుకున్నారు. ఈ కాంబినేషన్లో వచ్చిన మరో ఆధ్యాత్మిక చిత్రం ‘షిరిడి సాయి’. తొలి రెండు సినిమాలైతే మనకు కొంచెం కొత్తే. దీనికి తోడు దర్శకేంద్రుడు.. తనదైన గ్లామర్, ఎంటర్టైన్మెంట్ టచ్ ఇచ్చి.. ఆ సినిమాల్ని అందరూ మెచ్చేలా తీర్చిదిద్దారు. ఐతే తాజా చిత్రం మాత్రం ఆ రెండింటికీ భిన్నమైంది. అక్కడ భక్తుడు ప్రధాన పాత్రధారి అయతే ఇక్కడ దైవానిది ముఖ్య పాత్ర. కాబట్టి మసాలాలు అద్దే అవకాశం లేదు. అందులోనూ ఇది అందరికీ తెలిసిన కథ. ఇప్పటికే సాయి నేపథ్యంలో సినిమాలు కూడా వచ్చాయి. ఇన్ని పరిమితుల మధ్య తయారైన ‘షిరిడి సాయి’ ప్రేక్షకుల్ని మెప్పించిందా..? చూద్దాం!

కథ గురించి చెప్పాల్సిన కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందరికీ తెలిసిందే. సాయి పుట్టుక నుంచి మరణం వరకు ఆయన జీవితాన్ని చూపించారు. ఇలాంటి సినిమా తీయాలన్న ప్రయత్నం మెచ్చదగిందే. ఐతే పైన చెప్పుకున్న పరిమితుల మధ్య ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దితే తప్ప ప్రేక్షకులకు ఎక్కదు. ఈ విషయంలో చిత్ర బృందం కొంతమేరకు విజయవంతమైంది. సినిమా ప్రథమార్ధంలో బాబా మహిమల మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. ద్వితీయార్ధంలో సాయితత్వాన్ని చెప్పేందుకు ప్రయత్నించారు.  ఐతే అన్నమయ్య, శ్రీరామదాసు తరహాలో విభిన్నమైన సన్నివేశాలు చూపించడానికి ఇందులో ఎక్కువ అవకాశం లేకపోయింది. భక్తి విషయాన్ని పక్కనబెడితే.. సాయి తత్వాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో రాఘవేంద్రరావు సఫలమయ్యారు. టైటిల్స్ సమయంలో సాయి జన్మ వృత్తాంతాన్ని బొమ్మల రూపంలో చెప్పడం.. ఆ సందర్భంగా వచ్చే పాట ఆకట్టుకుంటాయి. గతలో వచ్చిన సాయి సినిమాలకు భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు చేశారు. శ్రీహరి పాత్ర ఆ ఉద్దేశంతో తెచ్చిందే. ఐతే ఆ పాత్ర పండలేదు. శ్రీహరి ఏమాత్రం ఆ పాత్రకు సూటవలేదు. ఆరంభంలో ఆంగ్లంలో డైలాగులు చెప్పే శ్రీహరి పాత్ర.. చివర్లో స్లాంగ్ కూడా మార్చకుండా అచ్చతెలుగులో మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. షాయాజి షిండే పాత్రను విలన్ లా ప్రొజెక్ట్ చేయాలని చూశారు కానీ.. అతనికి ఏదో ఒక దశలో జ్నానోదయం అవుతుందని ముందే అర్థమవతుంది. ఐతే కావాలనే అతని పాత్రను చివరిదాకా పొడిగించారు. షాయాజి పాత్ర ద్వారా కాస్త వినోదం పండిద్దామన్న ప్రయత్నం చేశారు కానీ.. అదేం ఫలితాన్నివ్వలేదు. ప్రథమార్ధం సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ కు ముందొచ్చే శ్రీరామనవమి-ఉరుసు సన్నివేశం బావుంది. క్లైమాక్స్ లో నాగ్ ను చూస్తే అన్నమయ్య గుర్తొస్తుంది. క్లైమాక్స్ గొప్పగా ఉంది. రాఘవేంద్రరావు తన ప్రత్యేకత అంతా ఇక్కడే చూపారు. ఐతే అంతకుముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తిని తగ్గిస్తాయి. బాలసాయిగా చేసిన కుర్రాడు ఆకట్టుకోలేదు. నటీనటుల మేకప్ విషయంలో శ్రద్ధ వహించలేదు. బాలసాయి పెద్దవాడై తిరిగి వచ్చే సమయానికి ముసలావిడ మేకప్ మార్చారు కానీ.. శరత్ బాబు మాత్రం అంతకు ముందులాగే ఉంటాడు. కమలిని కూడా తొలి సన్నివేశంలో ఓ మేకప్ తో ఉంటుంది.. తర్వాతి సన్నివేశంలో మరోలా ఉంటుంది. ఇవి చిన్న విషయాలే కావచ్చు. వీటిని పట్టించుకోకుంటే ప్రేక్షకుడు సినిమాలో లీనం కాలేడు.

రాఘవేంద్రరావు మునుపటి స్థాయిలో మాయ చేయలేకపోయారు కానీ ఉన్న పరిమితుల్లోనే ‘శిరిడి సాయి’ని బాగానే తీశారు. కొన్పి సన్నివేశాల్లో ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. పాటల చిత్రీకరణ.. అందులోనూ మొదటి పాట ‘ఒక్కడే దేవుడు’ పాట చిత్రీకరణ బాగుంది. ఖర్చుకు వెనుకాడకుండా మంచి ప్రయత్నం చేసిన నిర్మాత మహేష్ రెడ్డిని అభినందించాలి. సినిమాను నిలబెట్టడానికి కీరవాణి శాయశక్తులా ప్రయత్నించారు. ఆయన సంగీతమే సినిమాకు ప్రధాన ఆకర్షణ.  స్కోర్ తీసి చూస్తే.. సన్నివేశాలు చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కడే దేవుడు, నీ పాదముల.. పాటలు ఆకట్టుకుంటాయి.  ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ తీసి చూస్తే.. సన్నివేశాలు చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కడే దేవుడు, నీ పాదముల.. పాటలు బాగా ఆకట్టుకుంటాయి. పరుచూరి బ్రదర్స్ మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. నువ్వు తినడం ప్రకృతి, పక్కవాడిది దోచుకు తినడం వికృతి, నువ్వు తింటూ పక్కవాడికి పెట్టడం సంస్కృతి.. అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి డైలాగులు మరికొన్ని ఉన్నాయి.

అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రల్లో ఒదిగిపోయిన నాగార్జున సాయి పాత్రలోనూ ఆకట్టుకున్నారు.ఆరంభంలో సాయి పాత్రలో నాగ్ ను చూడగానే మామూలుగా అనిపిస్తారు. సినిమా సాగే కొద్దీ పరిణతి కనిపిస్తుంది. సన్నివేశాలు సాగే కొద్దీ సాయి దేవుడిలా మారుతున్న భావన కలిగిస్తాడు నాగ్. పతాక సన్నివేశంలో మళ్లీ అన్నమయ్య, శ్రీరామదాసులను గుర్తుకు తెచ్చారు. ఐతే కొన్నిచోట్ల ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు సూటవలేదు. పతాక సన్నివేశంలో, మరికొన్ని సన్నివేశాల్లో చక్కగా అభినయించిన నాగ్.. కొన్నిచోట్ల మాత్రం ఇబ్బందిగా కనిపించారు. పాత్ర హావభావాల విషయంలో యూనిఫార్మిటీ మెయింటైన్ చేయలేకపోయారు. బహుశా దర్శకుడి సూచన మేరకు అలా చేశారేమో. మూడు రోజుల పాటు తాను పైలోకానికి వెళ్లొస్తానని చెప్పే సన్నివేశంలో నాగ్ నటన అంతగా ఆకట్టుకోలేదు. అన్నీ తెలిసిన దేవుడు.. అంత ఉద్వేగానికి ఎందుకు గురవుతాడో అర్థం కాదు. పరిణతితో కనిపించాల్సిన సాయి పాత్ర అంత ఉద్వేగానికి లోనవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐతే ఓవరాల్ గా నాగ్ సాయిబాబా పాత్రలో మెప్పించారు. దాసుగణంగా శ్రీకాంత్, నానావతిగా సాయికుమార్, సుందరీబాయిగా కమలిని, సెహన్ షాగా శరత్ బాబు ఆకట్టుకున్నారు.

మొత్తంగా చూస్తే శిరిడి సాయి నిరాశ పరచదు. ఈ కాలంలో ఇలాంటి సినిమాలు రావడం గొప్ప విషయం. రొటీన్ మాస్ సినిమాల మధ్య ‘శిరిడి సాయి’ ఉపశమనాన్నిచ్చేదే. ఐతే అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల రోజులు వేరు. లాంగ్ రన్ లో సినిమాలు నిలబడ్డాయి. కానీ ఇప్పుడంతా ఒకట్రెండు వారాల్లో తేలిపోయే వ్యవహారం. కాబట్టి పోటీని తట్టుకుని ‘షిరిడి సాయి’ నిలబడుతుందా లేదో చూడాలి........

Tuesday, September 4, 2012

వర్మ ‘భూత్ రిటర్న్స్’ ఫస్ట్‌లుక్.....

ఈ మద్య వరస గొడవలతో వివాదాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మకు ఎప్పుడు ఒకలాగే ఉండటం అసలు నచ్చదు. ప్రచారం కోసం అనవసరపు వివాదాలు సృష్టించి ఆ తరవాత అప్పలరాజు, దొంగల ముఠా వంటి సినిమాలు తీసి జనాలను ఫూల్స్ ను చేసిన వర్మ ఇప్పుడు కొద్దిగా మార్పు కోసం సినీ జనాలను భయపెట్టే ప్రయత్నాల్లో పడ్డాడు. గతంలో తాను రూపొందించిన ‘భూత్'కు సీక్వెల్‌గా ‘భూత్ రిటర్న్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

ram gopal varma bhoot returns first poster out


తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టరే ఇలా భయపెడుతుంటే సినిమా ఎలా ఉంటుందో? అక్టోబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 3డి ఫార్మాట్‌లో దీన్ని రూపొందించారు. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా...ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఈ చిత్రాన్ని విడుదచేస్తున్నారు. రామ్ గోపాల్ కెరీర్లోనే ఇది ఫస్ట్ 3డి సినిమా.

నిన్నటి తరం కథానాయిక మనీషా కోయిరాలా ఇందులో తల్లి పాత్ర పోషించగా, ఆరేళ్ళ అలయ్న అనే పాప కీలక పాత్ర పోషించింది. ఈ కథ వీరిద్దరి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, వీరిద్దరే ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తారు. జేడీ చక్రవర్తి మరో పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'భూత్ రిటర్న్స్ హర్రర్ మూవీ. బూత్ సినిమా మిమ్మల్ని భయపెడితే.., భూత్ రిటర్న్స్ మిమ్మల్ని చంపేస్తుంది' అని అంటున్నాడు వర్మ. వివాదాలతో చేసిన ప్రయోగాలూ కాసులు రాల్చవనే ఉద్దేశానికి వచ్చి తిరిగి తన పాత ఫార్ములానే నెత్తి కెత్తు కుంటున్న వర్మ ఈ సినిమాతో ఎంత వరకు సఫలీకృతం అవుతాడో వేచి చూడాలి.

శ్రీకాంత్ సినిమా ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్......

Pawan Kalyan Launch Devaraya Audio
శ్రీకాంత్, విదీష, మీనాక్షి దీక్షిత్ కాంబినేషన్లో నాని కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవరాయ'. నానిగాడి సినిమా సమర్పణలో సన్ రే ఇంటర్నేషనల్ పతాకంపై కిరణ్ జక్కం శెట్టి, నాని కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఈ నెల 12న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పాటలను ఆవిష్కరించనున్నారు.

ఈ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ...‘పవన్ కళ్యాణ్ మా ఫంక్షన్‌కు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ కెరీర్లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. శ్రీకృష్ణ దేవరాయలు, దొరబాబుగా ఆయన రెండు పాత్రల్లో కనిపిస్తారు. రాయలవారి గెటప్‌లో ఆయన చాలా హుందాగా ఉన్నారు. షూటింగ్‌తో పాటు రీ రికార్డింగ్ తదితర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం డీటీఎస్ వర్క్ కు సిద్ధం అవుతున్నాం. చక్రి సంగీతం ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల ద్వితీర్థంలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు.
100 సినిమాల హీరో శ్రీకాంత్‌ శ్రీకృష్ణదేవరాయలుగానూ, విలేజ్‌లో దొరబాబుగానూ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘దేవరాయ'. ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ 'నాని నాకు మూడు కథలు చెప్పారు. అందులో ఈ కథ నచ్చి నాకూ ప్లస్‌ అవుతుందని అంగీకరించాను. చెప్పినట్లు బాగానే తీశాడు. ఇందులో దేవరాయగా, దొరబాబుగా రెండు పాత్రలు పోషించాను. ఒకరకంగా చెప్పాలంటే ఇష్టపడి, ఒల్లు దగ్గర పెట్టుకుని పనిచేశాను.

మహేష్ సినిమాలో దేవిశ్రీ ఎక్స్‌పర్మెంట్......

 


మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్‌తో తొలి సినిమా కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు.

ఇందులో ఓ సాంగుపై దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్‌పర్మెంట్ మొదలు పెట్టాడు. దీని గురించి తన మైక్రో బ్లాగింగ్ సైట్లో ప్రస్తావిస్తూ...‘మహేష్ బాబు, సుకుమార్ సినిమాకు సంథింగ్ స్పెషల్‌గా రాడికల్లీ డిఫరెంట్‌గా ట్యూన్స్ ట్రై చేస్తున్నాను. ఇది తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా ఉండబోతోంది. కొత్తదనాన్ని ఆడియన్స్ స్వాగతిస్తారని తన నమ్మకం' అంటూ పేర్కొన్నారు.

సుకుమార్ తన వరుస సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ప్రిపర్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య, ఆర్య2, జగడం, 100% లవ్ చిత్రాలకు దేవిశ్రీనే స్వరాలు సమకూర్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమాకు దేవిశ్రీ అందించే అందించే సంగీతంపై కూడా మంచి అంచనాలున్నాయి....


కమల్‌ 'విశ్వరూపం'లేటుకి కారణమేంటి?

 


కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ కావటం లేదు. దానికి కారణం డిస్ట్రిబ్యూటర్స్ కరువు అని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తయారుకావటంతో ఈ సినిమాకు ఎక్కువ రేట్లు చెప్తున్నారని అందుకే బిజినెస్ కావటంలేదని చెన్నై వర్గాలు సమాచారం. బిజినెస్ మొదలైన వెంటనే రిలీజ్ డేట్ అపీషియల్ గా ప్రకటిస్తారని చెప్తున్నారు.

ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల్ని విడుదల చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసి కమల్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా పండిట్‌ బిర్జూ మహారాజ్‌ దగ్గర కథక్‌ నృత్యం నేర్చుకొన్నారు. కథలో ఆ నృత్యం కీలకమని సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఇది తెరకెక్కింది. ప్రముఖ దర్శకులు శేఖర్‌ కపూర్‌ ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. కథలో ఆ పాత్ర కీలకమై సినిమాను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూర్చారు.

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాహల్ బోస్ ని విలన్ గా కనిపించనున్నారు. సమీరా రెడ్డిని హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరిగింది. హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ చిత్రమే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.....


పవన్‌పై ఆవి రూమర్లే......

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మూడో సెటప్ పెట్టారని, తీన్ మార్‌లో నటించిన రష్యన్ భామ డానా మార్క్స్‌తో డేటింగ్ చేస్తున్నారని, వీరు ఇద్దరు అమ్మానాన్నలు కూడా అయ్యారని నిన్న టీవీ ఛానల్స్, నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలను మేం ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇవన్నీ వట్టి రూమర్లే అని తేలి పోయింది.

డానా మర్క్స్‌కు ఇప్పటికే కాల్విన్ మాస్సన్ అనే వ్యక్తితో మే 5, 2012లో పెళ్లయిందని... ప్రస్తుతం వారు కలిసే ఉంటున్నారని స్పష్టమవుతోంది. అయితే డానా మాత్రం గర్భవతి కాలేదని వాళ్ల రిలేషన్ షిప్ ఫోటోలు చూస్తే స్పష్టమవుతోంది. ఎలాంటి ఆధారం లేకుండానే కేవలం పుకార్లను బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్‌పై ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.... పవన్ కళ్యాణ్‌కి పోటీ‌గా టాలీవుడ్లో రాణిస్తున్న ఓ స్మార్ట్ స్టార్ హీరోకు సంబంధించిన అభిమాని రవి పవన్ కళ్యాణ్ ఇలాంటి రూమర్లు స్ర్పెడ్ కావడానికి కారణం అయ్యారని తెలుస్తోంది. అతని సోషల్ నెట్వర్కింగ్ లోని మెసేజ్‌లను పరిశీలించిన పవన్ అభిమానులు అతనిపై కేసు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా... పవనిజం అంటూ అభిమానిస్తున్న తమ హీరోపై ఉమనిజం అంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపై నిజాలు నిగ్గు తేలడంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Monday, September 3, 2012

రామ్ చరణ్ ‘నాయక్’ స్టోరీ ?...

 


మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘నాయక్' చిత్రం స్టోరీ లైన్ లీకైనట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నవిషయం తెలిసిందే. స్టోరీ వివరాల్లోకి వెళితే....

రామ్ చరణ్... రామ్, చెర్రీగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. వీరిలో రామ్ మాస్ అయితే...చెర్రీ క్లాస్. రామ్ గొడవల్లో తలదూరుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కొందరిని హత్య చేస్తాడని తెలుస్తోంది. రామ్ చేసిన హత్యలకు అదే పోలికలో ఉన్న చెర్రీ పోలీసులు అరెస్ట్ చేస్తారట.

ఇంటర్వల్‌లో ట్విస్ట్ .. ఈ కేసులో చెర్రీను కోర్టులో ప్రవేశపెట్టి వాదోపవాదాలు విన్న తరువాత చెర్రీకు జడ్జీ శిక్ష విధిస్తుండగా రామ్ ఏంట్రీ ఇస్తాడని...రామ్ తనే ఈ హత్యలన్నీ చేశానని ఈ హత్యలతో చెర్రీకు ఏ సంబంధం లేదని ఒప్పుకుని లొంగిపోతాడట. ఇక సెకండాఫ్‌లో రామ్ ఆ హత్యలు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరిస్తాడని అంటున్నారు.

ఇలా చిత్రం సీన్‌ టు సీన్ ట్విస్ట్‌లతో వివి వినాయక్ భారీ రేంజ్లో తెరకెక్కించాడట. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికిఉపయోగపడేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి చిత్రాలలో కూడా హీరో.. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించి పోరాడే వాడు. అదే స్టైల్ లో రామ్ చరణ్ కూడా మెగాభిమానులను అలరించనున్నారు.


రాణాపై త్రిష సంచలన వ్యాఖ్యలు.....

Rana Was Special My My Life
దగ్గుబాటి యువ హీరో రాణా, త్రిష మధ్య సంథింగ్ సంథింగ్ మ్యాటర్ నడుస్తోందని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నసంగతి తెలిసిందే. అయితే అటు త్రిషతో పాటు రాణా కూడా ఈ వార్తలను ఖండించారు. అయితే రాణాతో ఉన్న సంబంధంపై త్రిష తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

"రానాతో నేను పంచుకోలేని విషయం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నాకు సంబంధించిన ప్రతి సంగతీ రాణాకు తెలుసు...రాణాది అర్థం చేసుకునే మనస్తత్వం. తన వాళ్లను అతనెంతో జాగ్రత్తగా చూసుకుంటాడు, తన జీవితంలో రాణాకు ప్రత్యేకమైన స్థానం ఉంది' ఉంది అంటూ జనాల్లో అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది త్రిష.
"రాణా నాకు ఎంతో మంచి మిత్రుడు. దాదాపు పదేళ్ల నుంచీ మేం ఒకరికొకరం తెలుసు. మేం ఇరుగుపొరుగు ఇళ్ల వాళ్లం కూడా. మా మధ్య ప్రేమ, పెళ్లి లాంటి ఏమీ లేవు. నేను దాపరికం లేకుండా ఉంటానని మీకు తెలుసు కదా. ప్రస్తుతానికి ఎవరితోనూ ప్రేమ, పెళ్లి వంటివి లేవు'' అని మరోసారి తెగేసి చెప్పింది.

రాణాతో సంబంధం లేదంటూనే...త్రిష ఇలా మాట్లాడుతుండటంతో ఎక్కడో తేడా కొడుతుందని, భవిష్యత్‌లో వీరు ప్లేటు ఫిరాయించినా ఆశ్చర్య పడక్కర్లేదని ఫిల్మ్ నగర్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో చాలా మంది సీని జంటలు మొదట ఇలానే బుకాయించి ఆ తర్వాత జనాలకు షాకిస్తూ కలిసిన సందర్భాలున్నాయని గుర్తు చేస్తున్నారు. మరి రాణా-త్రిష ఆ బాపతేనా? కాదా? అనేది త్వరలోనే బయటపడుతుంది.

అమె పవన్ తొ వుంతె ఇతనెవరు? ....

 
 


Sunday, September 2, 2012

ఐటం సాంగ్ కోసం ప్రెంచ్ గెడ్డం సగం తీసేసా:నాగ్.....

Charmi Sizzle As Sakkubai
నాగార్జున తన తాజా చిత్రం లవ్ స్టోరీ కోసం ప్రెంచ్ గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన తన గెడ్డం సగం తీసేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే చెపుతూ...తాజాగా ఛార్మి కోసం చేసిన సక్కుబాయి ఐటం సాంగ్ కోసం నా గడ్డం సగం తీసేయాల్సి వచ్చింది. నేను మళ్లీ త్వరగా పెంచాలి. ఎందుకంటే దశరధ్ తో చేస్తున్న రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీలో పాత్రకు ఈ గడ్డం ఉండాలి అన్నారు. ఇక ఢమురకం చిత్రంలో సక్కుబాయి పాట వస్తుంది.

లక్ష్మిరాయ్ ని అనుకున్న తర్వాత అనుకోకుండా సీన్ లోకి వచ్చేసి ఛార్మి ఈ పాట ఛాన్స్ ని కొట్టేసింది. అన్నపూర్ణ వేసిన సెట్ లో ఈ పాటను చాలా లావిష్ గా తీసారు. ఈ విషయమై ఛార్మి చాలా ఆనందంగా ఉంది. ఆమె ఈ పాటకు చెందిన ఫోటోలను ట్విట్టర్ లో ఉంచి తన హ్యాపీనెస్ ని తెలియచేసింది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ జరుగుతుంది. మరో మూడు,నాలుగు రోజుల్లో ఈ పాట పూర్తి కానుంది. ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ,అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.

ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ....‘నా కెరీర్లోనే మొదటి సారి ఇలాంటి ఫాంటసీ మూవీ చేస్తున్నాను. హై టెక్నికల్ వేల్యూస్‌తో చేశారు. నా కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది నాకు చాలా పెద్ద రేంజ్ సినిమా అవుతుంది' అన్నారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ...‘ఒక పాట మినహా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. నాగార్జున కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ అవుతుంది. జులై రెండో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...‘నాగార్జున కెరీర్లోనే ఇదో పెద్ద లాండ్ మార్క్ అవుతుంది. నిర్మాత వెంకట్ ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నారు' అని చెప్పారు. కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి మాట్లాుడుతూ...‘ఒక వైపు పోస్టు ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి' అని చెప్పారు.

కవలలుగా ప్రియమణి్,హీరో సూర్య సినిమాలూ....

Kv Anand S Maatran Differs From Priyamani
ఇప్పుడు తమిళ,తెలుగు పరిశ్రమలలో హాట్ టాపిక్ ఏమిటంటే...సూర్య నటించిన మాట్రాన్, ప్రియమణి నటించిన చారులత కథ ఒక టేనా..అని. ఎందుకంటే ఈ రెండు సినిమాలూ కూడా అవిభక్త కవలల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నాయి. అయితే చారులత చిత్రం ఎలోన్ అనే థాయిల్యాండ్ చిత్రానికి రీమేక్ అని దర్శకనిర్మాతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే మాట్రాన్ చిత్రం అమెరికాలో జరిగిన ఒక యదార్థ కథ ఆధారంగా తెరకెక్కించినట్లు దర్శకుడు కె వి ఆనంద్ చెబుతున్నారు. ఎలోన్ చిత్రాన్ని తాను చూశానని ఆ చిత్రానికి, మాట్రాన్ చిత్రానికి సంబంధం ఉండదని ఆయన అంటున్నారు.

మాట్రాన్ విషయానికి వస్తే..వరుస విజయాలతో ప్రముఖ యువ హీరోల వరుసలో ముందున్న సూర్య అవిభక్త కవలలుగా నటించిన చిత్రం మాట్రాన్. హిట్ చిత్రాల దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పాతి అఘోరం నిర్మిస్తున్నారు. ఉత్తమ నిర్మాణ విలువలతో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రం పలు విశేషాలను సంతరించుకుంది. అయన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత సూర్య కెవి ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం మాట్రాన్. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మాట్రాన్ అక్టోబర్ 12న విడుదల కానుంది.

మాట్రాన్ కథ .. అవిభక్త కవలలుగా పుట్టిన యువకుల జీవితంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనలు, ఎదురయ్యే సంకట పరిస్థితులు, వినూత్న అనుభవాల సమాహారమే మాట్రాన్ చిత్రం అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇంతవరకు ఎవరూ చెప్పని ఒక సందేశాన్ని ఈ చిత్రం ద్వారా తెలపనున్నట్లు అంటున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందంతో కూడిన అభినయం, హరీష్ జయరాజ్ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ కాగలవంటున్నారు. మాట్రాన్ చిత్ర షూటింగ్‌ను మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రాంతాలతో పాటు లాటేరియా (రష్యా), బాల్గన్ దేశాల్లోనూ చేశారు. స్వదేశీ సాంకేతిక నిపుణులతో పాటు విదేశీ నిపుణులు మాట్రాన్ కోసం పని చేశారు.

ఇక చారులత ఈ వారంలో తెరపైకి రానుంది. ప్రియమణి అవిభక్త కవలలుగా నటించిన చిత్రం చారులత. కన్నడంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన ద్వారకేష్ ఫిలింస్ సంస్థ కన్నడం, తమిళం భాషల్లో నిర్మించిన ఈ చిత్రంపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్ర విజ యంపై ఎంత నమ్మకం లేకపోతే దీన్ని తెలుగులో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, తమిళంలో సాక్సే పిక్చర్స్, మలయాళంలో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయడానికి ముందుకొచ్చాయి.

ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో నాకు తెలుసు : పూరీ........

 


 ''ఇన్నేళ్ల విరామం తరవాత మళ్లీ పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో నాకు తెలుసు. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. రాంబాబు పాత్రలో కొత్త పవన్‌ని చూస్తారు. మణిశర్మ అందించిన బాణీలు బాగున్నాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు పూరీ జగన్నాధ్. పూరీ జగన్నాధ్,పవన్ కళ్యాణ్ తో... ప్రస్తుతం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'గా సిద్ధమవుతున్నారు. ఆదివారం పవన్‌కల్యాన్‌ జన్మదినం. ఈ సందర్భంగా పూరీ ఇలా స్పందించారు.

'బద్రి' తరవాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. ఈ చిత్రాన్ని తొలుత అక్టోబరు 18న విడుదల చేయాలనుకొన్నారు. కానీ ఇప్పుడు వారం రోజుల ముందే.. అంటే అక్టోబరు 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అత్యంత వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కి మణిశర్మ స్వరపరిచిన పాటలను ఈ నెలలోనే విడుదల చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో పవర్‌ఫుల్ జర్నలిస్ట్‌గా పవన్ కనిపించనున్నారు. శక్తివంతమైన కథాంశంతో, పూర్తి ఎంటర్‌టైనర్‌గా పూరిజగన్నాథ్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని దానయ్య తెలిపారు. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో తీపి జ్ఞాపకంగా నిలిచిపోయే సినిమా ఇది అవుతుందని పూరిజగన్నాథ్ చెబుతున్నారు.'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.
ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం....

Saturday, September 1, 2012

మరో భూతం పట్టుకొస్తోన్న వర్మ!......

 




పట్టువదలని విక్రమార్కుడు బేతాళుడిని భుజాన వేసుకొన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ జనాలను భయపెట్టడానికి అలుపెరగకుండా దెయ్యాల సినిమాలను వెంటేసుకు వస్తుంటాడు. ప్రతి సారి విఫలుడయ్యే వర్మ…మళ్లీ అలాంటి ప్రయత్నాలే చేస్తుంటాడు. నాటి ‘రాత్రి’, ‘దెయ్యం’ మొదలు మొన్నటి ‘ఫూంక్’ వరకూ అన్నీ పరాజయాలే…కానీ ఒకే ఒక దెయ్యం సినిమా వర్మకు సక్సెస్ రుచి చూపించింది అదే ‘భూత్’. ఊర్మిలా, అజయ్ దేవగణ్ లు ప్రధాన పాత్రధారులుగా 2003లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని, వర్మకు కలెక్షన్లు, ఊర్మిలకు ప్రశంసలు తెచ్చిపెట్టింది. తాను తీసిన ఈ చెప్పుకోదగ్గ దెయ్యం సినిమా నుంచి మరింత రసం పిండుకోవడానికి వర్మ ప్రయత్నం చేస్తున్నాడు. ‘డిపార్ట్ మెంట్’ దెబ్బకు వర్మ కంపెనీ భారీ నష్టాల్లో పడిపోయింది. ఈ నేపథ్యంలో ‘భూత్ రిటర్న్స్’ ను కూడా నితిన్ మోహన్ అనే నిర్మాత సహకారంతో వర్మ కంపెనీ నిర్మిస్తుండటం గమనార్హం. ఈ సినిమాతో వర్మ మనీషా కొయిరాలకు నటిగా మళ్లీ జీవితాన్ని కల్పిస్తున్నాడు. వివాహానంతరం జీవితాన్ని గందరగోళపరుచుకొన్న మనీషను వర్మ తన సినిమా ద్వారా తిరిగి ఇండస్ట్రీకి దగ్గర చేస్తున్నాడు. దీనికైనా వర్మను అభినందించాలేమో. ఈ సినిమాలో వర్మ ఆస్థాన నటుడు జేడీ చక్రవర్తి మెయిన్ మేల్ రోల్ చేస్తున్నాడు. అంతే కాదు…వర్మ 3డీలో తీస్తున్న తొలి సినిమా ఇది. ఇక యాధాతథంగా హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఆక్టోబర్ 12 న విడుదల కాబోతోంది ‘భూత్ రిటర్న్’

'బ్లూ స్కై సినిమాస్' చేతికి బ్రహ్మీ ‘జెఫ్ఫా’ రైట్స్....

 


టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘జెఫ్పా' చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. జెఫ్ఫా' అనే పదాన్ని తెలుగు చిత్రాల్లో బ్రహ్మానందం ఉపయోగించినంతగా ఎవరూ యూజ్ చేసి ఉండరు... ఇప్పుడు అదే 'జెఫ్ఫా' అనే సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించడం విశేషం.. ‘‘నో రేప్, నో మర్డర్, నో కిడ్నాప్, నో మాఫియా, బట్ స్టిల్ హి మోస్ట్ వాంటెడ్'' అనేది దీనికి క్యాప్షన్లు.

ఈ చిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్, డివిడి-విడిసి రైట్స్ ‘బ్లూ స్కై సినిమాస్' సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం టీజర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం టెర్రరిస్టు జఫ్పార్ ఖాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్ంరలో ఇంకా అలీ, వేణు మాధవ్, ఇతర కమెడియన్లు కూడా నటిస్తున్నారు....


నిర్మాణ రంగంలోకి ‘పవర్ స్టార్’?

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారా? సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించబోతున్నారా? అంటే అవుననే గాసిప్స్ వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్లో...
‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో సదరు ప్రొడక్షన్ హౌస్ మొదలవ్వనుందని చర్చించుకుంటున్నారు. దీని ద్వారా టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంతో పాటు చిన్న, భారీ బడ్జెట్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారటన పవర్ స్టార్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో. ఎంత టాప్ హీరో అయినా.... కొన్నాళ్ల వరకు మాత్రమే. అన్నయ్య చిరంజీవి లాగా వయసు పైబడ్డాక సినిమాల నుంచి తప్పుకోక తప్పదు. అయితే రాజకీయాలంటే ఇంట్రస్టులేని పవన్ కళ్యాణ్ భవిష్యత్‍‌లో సినీ నిర్మాణ రంగంలో రాణించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. అదే విధంగా దర్శకత్వంపై కూడా దృష్టి పెట్టనున్నాడట.


ఆ రెండు హైలెట్‌గా 'గంగతో రాంబాబు'....

 


‘నువ్వు నందావైతే నేను బద్రి..బద్రినాథ్' ఈ డైలాగ్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీసు షేక్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి' సూర్ డూపర్ హిట్ అయింది. ఆ చిత్రం తర్వాత పన్నెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తోన్న సూపర్ సెన్సేషనల్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'ను సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా బేనర్‌పై నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

సెప్టెంబర్ 2 పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర విశేషాల్ని నిర్మాత డి.వి.వి దానయ్యను అడిగినప్పుడు... ‘పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సినిమాలో. పవర్ స్టార్ పెర్ ఫార్మెన్స్ హైలెట్‌గా పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్మెంట్, సూపర్ సాంగ్స్‌తో, థ్రిల్లింగ్ యాక్షన్‌తో ప్రేక్షకులు, పవన్ అభిమానులు అందరూ మెచ్చే విధంగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' రూపొందుతోంది. టోటల్ టాకీ పార్ట్ పూర్తయింది. సెప్టెంబర్‌లో బ్యాలెన్స్‌రెండు పాటల చిత్రీకరించడంతో చిత్రంలోని ఐదు పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. మా బేనర్లో, పవర్ స్టార్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది. పూరి జగన్నాథ్ పవర్ స్టార్ కోసం రాసిన సూపర్ డైలాగలకు థియేటర్లు చప్పట్లతో దద్దరిల్లుతాయి. ఏకథాటిగా సింగిల్ షెడ్యూల్ లో ఇంత భారీ చిత్రాన్ని పూర్తి చేయగలిగామంటే పూరి ప్లానింగ్, పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ ప్రధాన కారణాలు. పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఇంత పెద్ద సెన్సేషనల్ ఫిల్మ్ తీస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రం నిర్మాణంలో అన్ని విధాలా ఎంతో సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను' అన్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...‘బద్రితో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మళ్లీ ఇన్నేళ్లకు సినిమా చేసే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి పవర్ ఫుల్ సినిమా ఎక్స్ ఫెక్ట్ చేస్తున్నారో అలాంటి పవర్ ఫుల్ సినిమా ఇది. డెఫినెట్ గా కళ్యాణ్ కెరీర్లో ఓ ల్యాండ్ మార్క్ అవుతుంది. ఇందులో కొత్త పవన్ కళ్యాణ్ ని చూస్తారు' అన్నారు.

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న ఫష్ట్ మూవీ ఇది. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే పూరి జగన్నాథ్ లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ తో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. కెమెరామెన్ గంగతో క్యారెక్టర్ నాకు ఎంతో బాగా నచ్చి చేస్తున్న క్యారెక్టర్' అన్నారు.

క్లైమాక్స్ సన్నివేశం జరుగుతుండగా ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్ చెప్పిన పెద్ద డైలాగ్ కి షాట్‌లో ఉన్న వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపితే దర్శకుడు పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకుని అభినందించారు. ఇలాంటి సూపర్ సీన్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి.
ఈ చిత్రం కోసం మణిశర్మ 5 సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. పూరి-మణి కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి', ‘చిరుత' వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత వస్తోన్న మరో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ఇది. సెప్టెంబర్లో విడుదలయ్యే ఈ ఆడియోలో 5 పాటలు దేనికదే హైలెట్ అవుతాయన్నారు.......


(బర్త్ డే స్పెషల్) పవర్ స్టార్ ప్రస్థానం...

అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో మెగా స్టార్ చిరంజీవి తమ్ముడుగా హీరోగా పరిచయమై గోకులంతో సీత, సుస్వాగతం వంటి విభిన్న కథాచిత్రాల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని తొలి ప్రేమతో లవ్ స్టోరీస్ లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి తమ్ముడుతో అన్నకు తగ్గ తమ్ముడుగా అద్భుత విజయాన్ని సాధించి బద్రితో తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకుని ఖుషితో రికార్డులు బ్రేక్ చేసి అందరూ తన స్టైల్ ని ఫాలో అయ్యే రేంజికి ఎదిగి జానితో దర్శకుడుగా పరిచయమై గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం చిత్రాలతో ఓపెనింగ్స్ క్రియేట్ చేసి జల్సాతో బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసి కొమురం పులి, తీన్ మార్, పంజా చిత్రాల తర్వాత గబ్బర్ సింగ్ తో మళ్ళీ తన పవర్ ఏమిటో చూపించి కలెక్షన్ల వర్షం కురిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కెమెరా‌మెన్ గంగతో రాంబాబుతో మరోసారి సరికొత్త రికార్డు సృష్టించడానికి వస్తున్నాడు.
happy birthday pawan kalyan


ఆయన అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి సోదరుడు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిల మూడవ కుమారుడు కొణిదల కళ్యాణ్ బాబు. పవన్, సెప్టెంబరు 2, 1973న జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్రమలోని మెగాస్టార్ చిరంజీవి (శివ శంకర వర ప్రసాద్), పవన్‌కు పెద్దన్నయ్య . నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య . పవన్, పరిశ్రమలోని తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి ని పెంచుకున్నాడు. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. సెప్టెంబర్ 2తో 41వ వసంతంలోకి అడుగు పెడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి  పుట్టినరోజు శుభాకాంక్షలు.....