Saturday, September 1, 2012

మరో భూతం పట్టుకొస్తోన్న వర్మ!......

 




పట్టువదలని విక్రమార్కుడు బేతాళుడిని భుజాన వేసుకొన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ జనాలను భయపెట్టడానికి అలుపెరగకుండా దెయ్యాల సినిమాలను వెంటేసుకు వస్తుంటాడు. ప్రతి సారి విఫలుడయ్యే వర్మ…మళ్లీ అలాంటి ప్రయత్నాలే చేస్తుంటాడు. నాటి ‘రాత్రి’, ‘దెయ్యం’ మొదలు మొన్నటి ‘ఫూంక్’ వరకూ అన్నీ పరాజయాలే…కానీ ఒకే ఒక దెయ్యం సినిమా వర్మకు సక్సెస్ రుచి చూపించింది అదే ‘భూత్’. ఊర్మిలా, అజయ్ దేవగణ్ లు ప్రధాన పాత్రధారులుగా 2003లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని, వర్మకు కలెక్షన్లు, ఊర్మిలకు ప్రశంసలు తెచ్చిపెట్టింది. తాను తీసిన ఈ చెప్పుకోదగ్గ దెయ్యం సినిమా నుంచి మరింత రసం పిండుకోవడానికి వర్మ ప్రయత్నం చేస్తున్నాడు. ‘డిపార్ట్ మెంట్’ దెబ్బకు వర్మ కంపెనీ భారీ నష్టాల్లో పడిపోయింది. ఈ నేపథ్యంలో ‘భూత్ రిటర్న్స్’ ను కూడా నితిన్ మోహన్ అనే నిర్మాత సహకారంతో వర్మ కంపెనీ నిర్మిస్తుండటం గమనార్హం. ఈ సినిమాతో వర్మ మనీషా కొయిరాలకు నటిగా మళ్లీ జీవితాన్ని కల్పిస్తున్నాడు. వివాహానంతరం జీవితాన్ని గందరగోళపరుచుకొన్న మనీషను వర్మ తన సినిమా ద్వారా తిరిగి ఇండస్ట్రీకి దగ్గర చేస్తున్నాడు. దీనికైనా వర్మను అభినందించాలేమో. ఈ సినిమాలో వర్మ ఆస్థాన నటుడు జేడీ చక్రవర్తి మెయిన్ మేల్ రోల్ చేస్తున్నాడు. అంతే కాదు…వర్మ 3డీలో తీస్తున్న తొలి సినిమా ఇది. ఇక యాధాతథంగా హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఆక్టోబర్ 12 న విడుదల కాబోతోంది ‘భూత్ రిటర్న్’

No comments:

Post a Comment