మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్తో తొలి సినిమా కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు.
ఇందులో ఓ సాంగుపై దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్పర్మెంట్ మొదలు పెట్టాడు. దీని గురించి తన మైక్రో బ్లాగింగ్ సైట్లో ప్రస్తావిస్తూ...‘మహేష్ బాబు, సుకుమార్ సినిమాకు సంథింగ్ స్పెషల్గా రాడికల్లీ డిఫరెంట్గా ట్యూన్స్ ట్రై చేస్తున్నాను. ఇది తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా ఉండబోతోంది. కొత్తదనాన్ని ఆడియన్స్ స్వాగతిస్తారని తన నమ్మకం' అంటూ పేర్కొన్నారు.
సుకుమార్ తన వరుస సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్నే సంగీత దర్శకుడిగా ప్రిపర్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య, ఆర్య2, జగడం, 100% లవ్ చిత్రాలకు దేవిశ్రీనే స్వరాలు సమకూర్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమాకు దేవిశ్రీ అందించే అందించే సంగీతంపై కూడా మంచి అంచనాలున్నాయి....
No comments:
Post a Comment