సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు మరో మారు సంచలన
వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ
పరిశ్రమలో ఐక్యత లేదని, నిర్మాతల మండలిలో పనిలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారని
ఆరోపించారు. సినీ పరిశ్రమలో అంతా కలిసున్నామనే వాదనలో నిజం లేదని, అంతా
అబద్ధమని, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిశ్రమ తయారైందని మోహన్
బాబు చెప్పారు.
పైరసీ విషయంలో నిర్మాలంతా ఒక్కతాటిపై లేరని, ఇక్కడ న్యాయం చేసే వాళ్లు, కనీసం పట్టించుకునే వారు కూడా లేరన్నారు. గతంలో విష్ణు నటించిన సినిమా పైరసీ రెడ్ హాండెడ్ గా పట్టుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. సినీ పరిశ్రమలో ఐక్యత ఉందనే విషయం అవాస్తవమని, అలా అనే వాళ్లు తన ముందు వచ్చి చెబితే అన్ని విషయాలు చెబుతానన్నారు.
మోహన్ బాబు వ్యాఖ్యలతో పరిశ్రమలోని డొల్లతనం బయట పడినట్లయింది. పరిశ్రమలో వర్గ పోరు నడుస్తుందని...ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలకు మోహన్ బాబు మాటలు బలం చేకూరినట్లయింది. మరో రెండు మూడు రోజుల్లో ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
పరిశ్రమలోని చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు రెండుగా చీలి పోయి పోటీ పడుతున్నారు. పెద్దనిర్మాతలైన సురేష్ బాబు వర్గం తరుపున స్రవంతి రవికిషోర్ పోటీ చేస్తుండగా...చిన్న నిర్మాతలకు సపోర్టుగా దాసరి లాంటి వారి అండతో తమ్మారెడ్డి భరద్వాజ బరిలో నిలిచారు.
పైరసీ విషయంలో నిర్మాలంతా ఒక్కతాటిపై లేరని, ఇక్కడ న్యాయం చేసే వాళ్లు, కనీసం పట్టించుకునే వారు కూడా లేరన్నారు. గతంలో విష్ణు నటించిన సినిమా పైరసీ రెడ్ హాండెడ్ గా పట్టుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. సినీ పరిశ్రమలో ఐక్యత ఉందనే విషయం అవాస్తవమని, అలా అనే వాళ్లు తన ముందు వచ్చి చెబితే అన్ని విషయాలు చెబుతానన్నారు.
మోహన్ బాబు వ్యాఖ్యలతో పరిశ్రమలోని డొల్లతనం బయట పడినట్లయింది. పరిశ్రమలో వర్గ పోరు నడుస్తుందని...ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలకు మోహన్ బాబు మాటలు బలం చేకూరినట్లయింది. మరో రెండు మూడు రోజుల్లో ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
పరిశ్రమలోని చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు రెండుగా చీలి పోయి పోటీ పడుతున్నారు. పెద్దనిర్మాతలైన సురేష్ బాబు వర్గం తరుపున స్రవంతి రవికిషోర్ పోటీ చేస్తుండగా...చిన్న నిర్మాతలకు సపోర్టుగా దాసరి లాంటి వారి అండతో తమ్మారెడ్డి భరద్వాజ బరిలో నిలిచారు.
No comments:
Post a Comment