తెలుగు, తమిళ హిట్ సినిమాలు బాలీవుడ్ కు రీమేక్ చేయడం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. తెలుగులో హిట్
సినిమాలపై బాలీవుడ్ వర్గాలు ఓ కన్నేసి మరీ చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా
ప్రభుదేవా దర్శకత్వంలో హిందీలో అక్షయ్ కుమార్ – సోనాక్షీ సిన్హా జంటగా
‘రౌడీ రాథోడ్’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇది
తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజా హీరోగా వచ్చిన
‘విక్రమార్కుడు’కు రీమేక్.
ఈ చిత్రంలో హీరో రవితేజ ‘జింతాతా చితా చితా’ అనే ఊతపదాన్ని ఉప యోగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆ చిత్రంలో అలాగే ‘జింతాతా చితా చితా’ అని ఓ పాట కూడా వస్తుంది. దీనిని యధావిధిగా బాలీవుడ్ లోనూ వాడేశారు. దీంతో తెలుగు ఆడియో హక్కులు ఉన్న ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి నోటీసులు పంపించారు. దీంతో జరిగిన తప్పుకు మూల్యంగా ఏకంగా రూ.50 లక్షలు ఇచ్చినట్లు సమాచారం.
No comments:
Post a Comment