Friday, August 31, 2012

సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'శిరిడి సాయి' - సెప్టెంబర్‌ 6 విడుదల...



అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్‌లో వస్తోన్న 'శిరిడి సాయి' చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు వున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి.

ఈ చిత్రం విడుదల కోసం నాగార్జున అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎ.సులోచనా రెడ్డి సమర్పణలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్న 'శిరిడిసాయి' ఈరోజు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత ఎ.మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ - ''ఈరోజు మా శిరిడి సాయి సెన్సార్‌ పూర్తి చేసుకుని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఒక మహాద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మా యూనిట్‌ని ప్రశంసించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నాగార్జునగారి అభిమానులు, ప్రేక్షకులు, సాయిబాబా భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనర్‌లో మొదటి సినిమాగా వస్తోన్న 'శిరిడి సాయి' చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ వుంది'' అన్నారు.

No comments:

Post a Comment