హీరో మంచు విష్ణు నటిస్తున్న ‘దేనికైనా రెడీ' చిత్రానికి ప్రభాస్ డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డబ్బింగ్ కార్యక్రమం పూర్తయింది. ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడంపై విష్ణు వివరణ ఇస్తూ..‘ఈ చిత్రంలో తన పాత్ర ప్రభాస్ను అనుకరిస్తుంది. అందుకే ప్రభాస్ డబ్బింగ్ చెప్పలి ఉందన్నారు.
తనకు సినీ పరిశ్రమలో ప్రభాస్, నితిన్, సునీల్ మంచి స్నేహితులని...వారి వాయిస్ని ఏదో ఒక సినిమాలో అనుకరించడానికి ముందుంటానని విష్ణు చెప్పుకొచ్చారు. తను అడగ్గానే వచ్చి డబ్బింగ్ చెప్పినందుకు ప్రభాస్కు థాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు.
‘ఢీ'తో తొలి విజయాన్ని ఢీ కొట్టిన మంచు విష్ణుకు ఆ తర్వాత అలాంటి హిట్టు దక్క లేదు. దీంతో ఇప్పుడు ‘దేనికైనా రెడీ' అంటున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో డా.మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచి టైమింగ్తో కామెడీని పండించగలనని ‘ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది ప్రేక్షకులను ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.
No comments:
Post a Comment