Thursday, August 23, 2012

మనోళ్లకు దూల తీరలేదు!.....




 
 
మనసు పెట్టి తీస్తే చిన్న సినిమాలను కూడా సూపర్ హిట్ చేయవచ్చు అని అనేక మంది నిర్మాతలు, దర్శకులు రుజువు చేస్తున్నారు. ఇక స్టార్ హీరో తో సినిమాలు చేస్తే తొలి రెండు వారాల్లోనే మంచి కలెక్షన్లు దక్కించుకోవచ్చు అని నిరూపణ అవుతోంది. కానీ మన తెలుగు నిర్మాతలకు తమిళ సినిమాలపై ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు భారీ రేట్లు పెట్టి కొనుక్కొన్న సినిమాలు దారుణ పరాజయాల్ని మూటగట్టుకొంటున్నా…పేరున్న నిర్మాతలు కూడా కోట్ల రూపాయలు పెట్టి తమిళ సినిమా హక్కులను కొనుక్కొంటున్నారు. తాజాగా బెల్లంకొండ సురేశ్ ఇలాంటి సాహసం చేశాడు. ఇతడు సూర్య నటించిన తమిళ సినిమా ‘మాట్రాన్’ తెలుగు హక్కులను 17 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నాడు అని సమాచారం. కేవీ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఏకంగా 17 కోట్ల రూపాయలు అంటే మాటలుకాదు. భారీ స్థాయి హిట్ టాక్ వస్తే తప్ప నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టేంత సీన్దీనికి ఉండదు. మరి కేవలం సూర్యను నమ్ముకొని అంత బడ్జెట్ పెట్టడం ఎంత మేరకు సేఫ్ అనుకొన్నాడో కానీ బెల్లం కొండ దుమ్ము రేపాడు. ఈ సినిమా తెలుగులో ‘డూప్లికేట్’ గా  అవుతోంది. ఇక సూర్య పరిస్థితి కూడా తెలుగు లో ఈ మధ్య కాలంలో ఏ మంత బాగాలేదు. ఇతడి సెవెన్త్ సెన్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ మధ్య నట్టి కుమార్ త్రీ అనే సినిమా రైట్స్ ను భారీ మొత్తానికి కొని నెత్తిన గుడ్డ వేసుకొన్నాడు. సూర్య సినిమా విషయానికి వస్తే నిజంగానే ఆ ధరకు రైట్స్ కొని ఉంటే, పాజిటివ్ టాక్  వస్తే తప్ప బెల్లంకొండను గట్టెక్కే పరిస్థితి లేదని విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ ప్రయోగాత్మక సినిమాతో బెల్లంకొండ ఏ కాడ తేలునో!

No comments:

Post a Comment