పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ పూర్తి కావస్తోంది. తాజాగా ఈచిత్రం షూటింగ్ విశేషాలను దర్శకుడు పూరి జగన్నాథ్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వివరిస్తూ... 3 పాటలు మినహా సినిమా షూటింగ్ ఈ నెలాకరుతో పూర్తవుతుందని వెల్లడించారు.
వచ్చే నెలలో మిగిలి ఉన్న మూడు పాటలు చిత్రీకరిస్తూనే...మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. చకచకా పనులు ముగుస్తుండటంతో అనుకున్న సమయం(అక్టోబర్ 18) కంటే వారం ముందుగానే అక్టోబర్ 11న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన ఈచిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. పవర్ స్టార్ ఈ చిత్రంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు. పవన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అండ్ ఎంటర్ టైన్మెంట్ అంశాలతో ఈచిత్రం రూపొందుతోంది.
No comments:
Post a Comment