పార్వతి మెల్టన్, ఇషాచావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి రమేష్ పుప్పాల నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ ''సామాజిక ఇతివృత్తంతో అల్లుకొన్న కథ ఇది. అక్షరాలనే ఆయుధాలుగా చేసుకొని శ్రీమన్నారాయణ పోరాటం సాగించిన తీరు అందరికీ నచ్చుతుంది. బాలకృష్ణ పలికిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. చక్రి అందించిన బాణీలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.
ఇక గతంలో ది ఎండ్ వంటి సినిమాలను రూపొందించి రాష్ట్రపతి అవార్డు పొందిన రవిచావలి ఈ సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దానని అంటున్నారు. బాలకృష్ణ విషయానికి వస్తే..ఈ మధ్యే విడుదలైన ‘అధినాయకుడు' డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘శ్రీమన్నారాయణ' పై బాలయ్య మంచి అంచనాలు పెట్టుకున్నారు. బాలయ్య ఈసినిమాలో జర్నలిస్టు పాత్ర పోషిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో ఇదే దర్శకుడు జగపతిబాబుతో ‘సామాన్యుడు' అనే సినిమా తీశాడు. సామాన్యుడు మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమా కూడా హిట్టవుతుందని అంటున్నారు.
No comments:
Post a Comment