గ్రహాలన్నీ ఒక చోటకి వస్తే ఎలాంటి ప్రళయం సంభవిస్తుందనే ఆసక్తికర అంశంతో మా చిత్రం తయారువుతోంది. 2012 తర్వాత యుగాంతం అనే అంశంతో మనకి కొన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా ఆ తరహా కథాంశంతో రూపొందుతున్న సినిమా అంటున్నారు నాగార్జున. నాగార్జున, అనుష్క జంటగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం'. ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు.
అలాగే "చందమామ, అమరచిత్రకథల తరహాలో ఉండే కథ 'డమరుకం'. కథ చాలా బాగుంటుంది. ప్రేక్షకులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ కారణంగానే ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. ఈ విషయంలో నిర్మాత వెంకట్ ఏ మాత్రం రాజీ పడకుండా గొప్పగా గ్రాఫిక్స్ చేయించారు. సెప్టెంబర్లో ఆడియో, అక్టోబర్లో సినిమా విడుదలవుతాయి. నాకు ఇది తొలి సోషియో ఫాంటసీ. పైగా నాకు తెలిసి తెలుగులో ఈ తరహా సినిమా ఎవరూ చేయలేదు'' అని నాగార్జున చెప్పారు.
కె. అచ్చిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఓ పాట మినహా షూటింగ్ పూర్తయైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
No comments:
Post a Comment