శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ చిత్రం బిజినెస్ చాలా ఊపుగా జరుగుతోంది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రం ఘన విజయం సాధించటంతో అలాంటి కాన్సెప్ట్ తరహాలో ఈ చిత్రంకి ట్రేడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. వచ్చే నెల 13న విడుదల అవుతున్న ఈ చిత్రం నైజాం రైట్స్ ని దిల్ రాజు ఫ్యాన్సీ ఎమౌంట్ కు తీసుకున్నారు. అలాగే ఆంధ్రా రైట్స్ మొత్తం ఇప్పటికే అమ్ముడుపోగా, సీడెడ్ రైట్స్ కూడా బిజినెస్ ముగింపు దశలో ఉంది. అలాగే ఓవర్ సీస్ బిజినెస్ చాలా బాగ జరిగినట్లు చెప్తున్నారు. ఇక శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు మంచి ఎమౌంట్ కి ఇప్పటికే తీసుకున్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...-‘‘నేను ఏ సినిమా చేసినా విలువల్ని మాత్రం మర్చిపోను. ఈ సినిమా మిమ్మల్ని షాక్కి, థ్రిల్కి గురి చేస్తుందని చెప్పను కానీ, కొన్నాళ్ల పాటు మీతో జర్నీ చేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. కోరికలు, ఆశలు, సంతోషాలు... ఇదే ఈ సినిమా కథ. ఓ కాలనీలోని ఆరుగురు యువకుల చుట్టూ తిరిగే కథ ఇది. మన బాంధవ్యాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమా ఓ విధంగా నా కల. ఈ కల కార్యరూపం దాల్చడానికే రెండేళ్లు పట్టింది. ఈ సినిమా మేకింగ్లో చాలా అవాంతరాలు ఎదురొచ్చినా అధిగమించగలిగాం. వేటూరిగారు లేకపోవడం నాకు గొప్ప విషాదం. ఈ సినిమాలో అమల తొలుత చేయనన్నారు. చాలా బతిమిలాడాను. ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఈ విషయంలో నాగార్జున గారికి కృతజ్ఞతలు చెబుతున్నా'' అన్నారు.
No comments:
Post a Comment