చిరంజీవి పుట్టినరోజుకు ఫస్ట్ లుక్ తో అలరిస్తాడనుకున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కాస్తా అనుకున్న సమయానికి రాలేకపోయాడు. తాజాగా ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడే విడుదలకానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 2న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఫస్ట్ లుక్ తో పాటు ‘గబ్బర్ సింగ్’ శతదినోత్సవ వేడుక కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది.
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జర్నలిస్టుగా మొదటి సారి నటిస్తున్న పవన్ ను దర్శకుడు పూరి జగన్నాధ్ తన దైన శైలిలో తీర్చిదిద్దాడని, పూరి డైలాగులు అద్యంతం అలరిస్తాయని తెలుస్తోంది. పూరి దేవుడు చేసిన మనుషులు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్ గా తేలడంతో ఢీలాపడ్డ పవన్ అభిమానులు అంతగా చింతించాల్సిన అవసరం లేదని యూనిట్ వర్గాలు అంటున్నాయి. కేవలం మూడు పాటలు ఈ చిత్రంకోసం చిత్రీకరించాల్సి ఉంది. అందమైన లొకేషన్ల కోసం పూరి జగన్నాధ్ వెతుకుతున్నారు.
No comments:
Post a Comment